మహా భారతంలోని ప్రతీ సంఘటన మనిషి జీవితానికి ఒక గుణపాఠమే. అలాంటి ఒక సంఘటనే గాంధారి శాపం. కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. ఇంత దారుణం జరిగినా తమకు చావురాలేదు అని బాధపడుతున్న ధృతరాష్ట్రుని వ్యాసమహాముని ఓదారుస్తూ… నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?” అన్నాడు.