కళ్లకు కాటుక, నుదిటిన బొట్టు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు… ఇవన్నీ అమ్మాయిల అందాన్ని మరింత పెంచేవి. మహిళలకు మరింత అందాన్ని తీసుకొచ్చేవి ఆమె వేసుకునే ఆభరణాలు. భారతీయ సాంప్రదాయంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి రకరకాల ఆభరణాలతో అలంకరించి ముచ్చటగా చూసుకుంటారు తల్లిదండ్రులు. కాలి పట్టీల నుంచి పాపిటబిళ్ల వరకు.. అమ్మాయికి అలంకరించాలే గానీ.. ఒళ్లంతా బంగారమైపోవాల్సిందే.
ప్రస్తుత ప్రపంచంలో ఫ్యాషన్ ఒక భాగమైపోయింది.
ఈ క్రమంలోనే పాదాలకు వెండి పట్టీలకు బదులు వివిధ రకాల డిజైన్లతో తయారైన పూసలు వంటి పట్టీలను కూడా ధరిస్తున్నారు. మరికొందరు సంపన్నులు ఏకంగా బంగారు పట్టీలు కూడా పాదాలకు తొడుగుతున్నారు.
ధరించాలని పండితులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో మహిళలు చాలా మంది బంగారు పట్టీలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి బంగారు పట్టీలు ఎట్టి పరిస్థితులలో కూడా పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు.
మన హిందూ పురాణాల ప్రకారం బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు వర్ణంలోనే బంగారం కూడా ఉంటుంది.
మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన బంగారంతో పట్టీలు చేయించుకొని పాదాలకు తొలగడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక సైన్స్ పరంగా కూడా పాదాలకు వెండి పట్టీల తొడగటం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని బయటకు తొలగించడానికి వెండి దోహదపడుతుంది.