హనుమంతునికి శనీశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటో తెలుసా ?

లంకాధిపతి రావణుని పెద్ద కుమారుడు మేఘనాధుడు. మేఘనాధుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని శనీశ్వరుని రావణాసురుడు బంధించాడు. ఆకాశంలో శని గమనంతో మేఘనాధుడికి అమరత్వం కలగలేదు. దీంతో కోపోద్రేకుడైన రావణుడు గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెదకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముని గుర్తుగా తనతోపాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకూ శనీశ్వరుడు లంకలోనే బంధీగా ఉన్నాడు.

Saneswaruduతోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకా దహనం చేశాడు. ఈ సందర్భంగా ఓ మూల బంధీగా ఉన్న శనిదేవుడి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి, బంధ విముక్తి చేయమని వేడుకుంటాడు. దీంతో హనుమ తన శక్తితో లంక నుంచి శనీశ్వరుడి విసిరితే వచ్చి ఇండియాలో పడ్డాడు. శని అక్కడ నుంచి రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మంటలు వ్యాపింపజేశాడు. అయితే ఆ మంటలకు శని కూడా నల్లగా మారిపోవడమే కాదు బంగారు లంక మొత్తం బూడిదగా మారింది.బంధవిముక్తి చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి, తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

Saneswaruduమరో పురాణం ప్రకారం కూడా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.

Saneswaruduకానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న మంచి కార్యానికి శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడి తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.

Saneswaruduఅందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR