ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ప్రకృతి తో మమేకమై జీవిస్తూ ఉంటాం. ప్రకృతి విలువ తెలుసు కాబట్టే పూజిస్తూ ఉన్నాం. మన సంస్కృతి ప్రకారం ఎన్నో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబ ఒకటి.
అదేవిధంగా హనుమంతుడి పుట్టుకకు కారణం కూడా ఈ మొక్క అని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు.
పురాణాల ప్రకారం ఈ కదంబ వృక్షానికి రెండు పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు. శ్రీకృష్ణుడు రాధతో తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించింది ఈ చెట్టు కిందనే కాబట్టి కృష్ణుడికి ఈ వృక్షానికి అవినాభావ సంబంధం ఉంది.