పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును.
ఈ క్రమంలోనే పరమశివుడికి ఎంతో మంది భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేయడం మనం చూస్తున్నాం. కానీ మన కోరికలు నెరవేరాలన్నా, సమస్యలు తీరిపోవాలన్న భూతేశ్వర్ నాధ్ ఆలయం సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఒక గ్లాసు నీటితో అభిషేకం చేస్తే చాలు మన సమస్యలు తీరిపోతాయి.
మరి ఈ ఆలయంలో ఉన్న స్వామివారి మహిమ ఏమిటి? ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం…
ఈ శివలింగానికి గ్లాస్ నీటితో అభిషేకం చేస్తే చాలు సమస్యలు తీరిపోతాయి.
చుట్టూ దట్టమైన అడవులు, అందమైన వాతావరణం మధ్యలో స్వామి వారు లింగాకారంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో శివలింగం మనకు దర్శనమిస్తుంది.
నిత్యం ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని పెద్దఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణమాసం, కార్తీక మాసం వంటి ప్రత్యేకమైన మాసాలలో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని స్వామివారి పై గ్లాసు నీటిని పోసి అభిషేకం చేస్తారు.
మరికొంత మంది భక్తులు కాలినడకన కూడా ఈ ప్రాంతానికి చేరుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా స్వామి వారికి ఒక గ్లాసు నీటిని పోయటం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా తొందరగా పరిష్కారం అవుతుందని అక్కడి భక్తుల విశ్వాసం. ఇక మహాశివరాత్రి, కార్తీకమాసం వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది