కొంతమంది మేము ఎంత న్యాయంగా ఉన్నా సరే లక్ష్మి మాదగ్గర నిలవట్లేదు అనుకుంటారు. అన్యాయం చేసే కొంతమంది దగ్గర ఉంటుంది అని బాధ పడుతున్నారు. కారణం తెలుసుకోండి. లక్ష్మీదేవి ఒకరోజు ఆవులమంద ఉన్నచోటికి వెళ్లి నన్ను మీదగ్గర ఉండనివ్వండి అని అడిగింది. గోవులు లక్ష్మిని చూసి నీవు చంచల స్వభావవు. నిన్ను మాదగ్గర ఉండనివ్వడం కుదరదు అని తెల్చి చేప్పాయి. అప్పుడు తన స్వభావాన్ని ఇలా వివరించింది.
ధనవంతుడు దగ్గర కూడా ఉన్నట్టే ఉంటాను. వీరికి తినాలనే ఉన్నా ఉబ్బసం, ఆయాసం, మధుమేహం లాంటి రోగాలు వీరిని పట్టి పీడిస్తాయి. అసత్యం పలికేవాడి దగ్గర, అధర్మం చేసేవాడి దగ్గర ఉంటాను. వీరికి సంపద ఉంటుంది. ఖర్చు కూడా చేస్తారు. జల్సాలు చేస్తారు. కాకపోతే వీరి ముందు తరాలు, వెనుకటి తరాలు నానా రకాలుగా బ్రష్టులైపోతారు.
అహంకరించే వారిదగ్గర, తల్లిదండ్రులను పట్టించుకోని వారిదగ్గర, వీరి భారాన్ని ఇతరుల పై వేసే వారిదగ్గర, అత్తమామల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకుని పీడించేవారి దగ్గర, అకారణ నిందలు మోపేవారి దగ్గర, తమ గొప్పలు తామే చెప్పుకునే వారిదగ్గర, కొంచం చేసి ఎక్కువ చేశామని చెప్పుకునే వారిదగ్గర, బ్రాహ్మణులని నిందించే వారి దగ్గర, (కొందఱు బ్రాహ్మణుడు చేడిపోయారని అందరిని నిందించకూడదు. ఎందుకంటే యజ్ఞాయాగాలతోనే లోకాలు తరిస్తాయి .