Home Unknown facts నవరాత్రుల తొమ్మిది రోజులు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా???

నవరాత్రుల తొమ్మిది రోజులు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా???

0

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటాం. ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. వీటిని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు నవరాత్రులు అంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు.

ఈ సందర్భంగా నవరాత్రులు నడిచే తొమ్మిదిరోజులకూ భక్తులు ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తుల్ని ధరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం…

మొదటి రోజు:

YELLOWనవరాత్రులు ప్రారంభమైన మొదటిరోజు శైలపుత్రిగా మనం దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

రెండో రోజు :

బ్రహ్మచారిణిగా శక్తిని కొలుస్తాం. కాబట్టి ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి.

మూడో రోజు:

అమ్మవారి అవతారం ఈ రోజు చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి.

నాలుగో రోజు :

దుర్గమ్మను కూష్మాండ అవతారంగా కొలుస్తాం. నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది.

అయిదో రోజు:

స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించి పూజచేయాలి.

ఆరో రోజు:

కాత్యాయనీ మాతగా అమ్మవారు కొలువుదీరే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

ఏడో రోజు:

కాళరాత్రి అవతారంతో అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుంది. ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి.

ఎనిమిదో రోజు:

మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి.

తొమ్మిదో రోజు:

చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందు కుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం.

Exit mobile version