ప్రతి ఏటా వేలాది మంది భక్తులు మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు వెళ్తుంటారు. అయ్యప్పను దర్శించుకునేందుకు కఠినమైన ప్రయాణం చేసి శబరిమల చేరుకుంటారు. ఈ సుదీర్ఘ యాత్రలో భక్తులు కఠిన ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తారు. చాలా దూరం కాలినడకనే వెళ్తారు. 41 రోజుల పాటు చేసే అయ్యప్ప దీక్షలో భక్తులు ఇంకా ఎన్నో నియమాలు, ఆచారాలు అనుసరిస్తారు. అయితే అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్తారని మీకు తెలుసా? ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు అయ్యప్ప భక్తులకు మసీదు, ఏం పని ? దానివెనుక కథేమిటో తెలుసుకుందాం.