నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో దుర్గా మాత నవశక్తి రూపాలను పూజిస్తారు. చాలామంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. తొమ్మిది రోజుల నవరాత్రి ఉపవాస సాంప్రదాయం ఉన్నప్పటికీ తొలి రోజు, 8వ రోజు ఉపవాసం ఉంటారు. దీని ద్వారా ఆరోగ్యంతో పాటు తల్లిపై గౌరవం, విశ్వాసం కూడా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఉవవాస దీక్షను పాటించడం వల్ల మనస్సులో కోరికలు నెరవేరడమే కాకుండా మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రతిరోజూ రెండుసార్లు కలశం ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
దుర్గా సప్తశతి పఠించాలి. దుర్గా మంత్రాలు, శ్లోకాలు జపించాలి.
ఉపవాసం చేయాలనుకుంటే ఉపవాసం ఆచారాలను పాటించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. స్వీయ నిగ్రహం కలిగి ఉండాలి.
మాంసాహారం, మద్య పానీయాలకు దూరంగా ఉండాలి.
నవరాత్రి సమయంలో గుండు చేయించుకోవద్దు. అంతేకాదు జుట్టు కూడా కత్తిరించుకోకూడదు.
గోళ్లు కత్తిరించకూడదు.
ఎవరి పట్ల కఠినంగా వ్యవహించవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధ్యానంతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి.