గోదావరి నది తీరమున వెలసిన ఈ ప్రాచీన ఆలయాన్ని ఉత్తర వాహిని తీరం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే గోదావరి నది జన్మస్థలం నుండి సముద్ర తీరంలో కలిసే వరకు ఈ ఒక్క చోటనే ఉత్తర దిశకు ప్రవహిస్తుంది. అందుకే చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు ఈ ఆలయం వద్ద గోదావరి ఉత్తర దిక్కునకు ప్రవహిస్తుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది ఇలా ఉంటె, సాధారణంగా నదులన్నీ పశ్చిమదిశ నుండి తూర్పునకు ప్రవహిస్తాయి. కానీ ఇచట ఉన్న గోదావరి నదికి ఒక ప్రత్యేకత ఉంది. కాశీలో గంగానది ఉత్తరదిశగా 6 కీ.మీ. ప్రవహిస్తుండగా చెన్నూరు ప్రాంతంలో పక్కూర్ గ్రామం నుండి కోటపల్లి మండలంలో పదుపల్లి గుట్టలవరకు గోదావరి నది ఉత్తరదిశగా 15 కీ.మీ. ప్రవహిస్తుంది.