తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. అయితే ఆ శ్రీవెంకటేశ్వర స్వామిని గోవిందుడిగా పిలువడమే కాకుండా గోవింద గోవిందా అంటూ తిరుమలలో అడుగుపెట్టిన భక్తులు ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద అంటూ భక్తుల గోవింద నామస్మరణం తో ఆలయం ప్రతిధ్వనిస్తుంది. మరి భక్తులు గోవింద నామస్మరణం చేయడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.