సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లు లాంటిది. ఎన్నో పురాతన ఆలయాలకు ఆలవాలం మన భారత దేశం. ప్రతి గ్రామానికి ఒక ఆలయం ఉంటుంది. కానీ కాశీ, పూరి జగన్నాధ్ క్షేత్రం, తిరుపతి లాంటి క్షేత్రాలు చాలా ప్రసిద్ధి. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ప్రతి దేవాలయానికి కూడా తప్పనిసరిగా క్షేత్రపాలకుడు ఉంటాడు.
క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని పరిరక్షిస్తూ, రక్షణ కల్పించే వాడని అర్థం. ఎంతో ప్రసిద్ధి చెందినదేవాలయాలకు తప్పనిసరిగా క్షేత్రపాలకుడు ఉంటాడు.
ఆలయంలో ఉన్న పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం తాళాలను వేసి తాళం ఆ ఆలయ క్షేత్ర పాలకునికి ఇవ్వాలి. ఉదయం క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుని స్వామివారికి అర్చన కార్యక్రమాలు, మొదలుపెడతారు. క్షేత్రపాలకుడు స్వయానా ఆ పరమేశ్వరుడు వెయ్యవా అంశంగా భావిస్తారు.
ఈ విధంగా ప్రతి ఆలయానికి క్షేత్రపాలకుడు ఎలాగ ఉంటాడో ప్రతి గ్రామానికి రక్షకుడిగా వీరభద్రుని రూపంలో కొలువై ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.