కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి గురించి తెలియని తెలుగు వారుండరు. మనకు నచ్చిన వస్తువులు వదిలేసి ఏం కోరిన తీర్చే విజ్ఞ వినాయకుడు శ్రీ వరసిద్ధి వినాయకుడు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకం లో లాగే కేరళలోని మధుర్ గ్రామం శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు.