Home Unknown facts వైకుంఠపాళీ ఆట గురించి ఆసక్తి కరమైన విషయాలు!

వైకుంఠపాళీ ఆట గురించి ఆసక్తి కరమైన విషయాలు!

0

వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపద సోపాన పటము అని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమిని ఆ ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయని హిందువుల విశ్వాసం.

Interesting facts about Vaikunthapali game!ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్ళు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందెం వేస్తూ పాచికలను బట్టి ఆటకాయలను నడుపుతూ ఉంటారు. ఆరు గవ్వలుగాని లేదా పాచికలుగాని పందెం వేస్తూ ఆడుతారు. ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు. అయితే ఆడే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఆట కాయలు ముందుగా ముందే నిర్ణయించుకోవాలి.

ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి. ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి/మింగి ఆటకాయ పాము తోక చివరివరకూ కిందికి దిగిపోతుంది. అయితే ఈ ఆటను ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అనే విషయాన్ని తెలుసుకుందాం.

పదమూడవ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని పిల్లలు ఆడుకునే ఒక ఆట తయారు చేసాడు. ఆ ఆట పేరు మోక్ష ప్రదం. ఆ తరువాతి కాలంలో బ్రిటిష్ వారు వచ్చి దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఈ మోక్షప్రదం ఆటను కాస్త స్నేక్ అండ్ లాడర్ గేమ్ గా మార్చేశారు. మన సంప్రదాయాలు, ఆచారాలతో పాటు దీన్ని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు బ్రిటీష్ వారు. ఆనాటి నుండి ఈ ఆటను వైకుంఠపాళీగా మనవాళ్ళు పిలుస్తారు.

 

Exit mobile version