మే డే అంటే సెలవు దినంగా, కార్మికుల దినోత్సవంగా మనలో చాలా మందికి తెలుసు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే అంటే ప్రపంచంలోని కార్మికులందరూ కలసి కష్టపడి సాధించుకున్న విజయ సూచిక మే డే. ఆనాడు కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడారు. ప్రాణాలు సైతం త్యాగం చేసి కార్మిక ప్రపంచానికి చీకటిని చెరిపేసి వెలుగునందించారు. మరి మొదటగా మే డే ఎప్పుడు జరుపుకున్నారు? కార్మికులు దేనికోసం పోరాడారు? కార్మికుల కష్టం కోసం పోరాడింది ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మారణహోమానికి నిరసనగా చికాగో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పటికే తోటి కార్మికులు చనిపోయారన్న ఆందోళనతో ఉన్న కార్మికులకు అక్కడి పోలీసుల చర్యల కారణంగా కార్మికులు మరింత ఉధృతంగా సమ్మె పోరాటాలు చేశారు. దాంతో మరింత రెచ్చి పోయిన ప్రభుత్వం సమ్మెకు నాయకత్వం వహిస్తున్న నలుగురు చికాగో కార్మికులకు ఉరిశిక్ష విధించింది. ఇలా కార్మికుల రక్తంతో తడిసి ముద్దై ఆవిర్భవించినదే అరుణపతాకం.