భారత దేశం అనేక మతాల సమ్మేళనం. ఇక్కడ చాలా మతాలు ఆదరించబడ్డాయి. అందులో ఒకటి జైన మతం. జైన మతం సాంప్రదాయికంగా జైన ధర్మ అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టింది. ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
ఇలా క్రిములు చనిపోవడం అంటే హింస చేసినట్టే కదా. ఇది వారి ధర్మానికి విరుద్ధం. కాబట్టే అలా జరగకుండా ఉండేందుకు గాను జైన సన్యాసులు నోటికి ముహ పట్టి ధరిస్తారు.
లేదంటే తెల్లని కర్చీఫ్ను అడ్డు పెట్టుకుంటారు. ఇలా చేసినా వారి ఆచారం పాటించినట్టే అవుతుందట.
కానీ సన్యాసులు మాత్రం ఇక నిరంతరంగా అలా ముహపట్టీ ధరించే ఉంటారు. అదండీ వారి ముహపట్టి వెనుక అసలు కారణం.