Home Unknown facts స్త్రీల రుతుక్రమం గురించి ఆశ్చర్యకర విషయాలు!

స్త్రీల రుతుక్రమం గురించి ఆశ్చర్యకర విషయాలు!

0
సాధారణంగా హిందూ మత సాంప్రదాయాల ప్రకారం పీరియడ్స్ సమయంలో మహిళను అపవిత్రంగా భావిస్తారు. సాంప్రదాయాల ప్రకారం, ఒక మహిళ ఆమె బహిష్టు సమయంలో దేవాలయాలకు లేదా ఆమె ఇంటి పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఆమె ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. ఊరగాయలను ముట్టుకోకూడదు. కాటుక లేదా ఎటువంటి అలంకరణ చేసుకోకూడదు. వంటగదిలోకి వెళ్ళకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే,ఒక మహిళ బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాలి.
వాస్తవానికి పాత కాలం రోజుల్లో, బహిష్టు సమయంలో మహిళలను ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచేవారు. బహిష్టు సమయంలో మహిళలు అన్ని రోజులు ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. ఆమె జుట్టు దువ్వకుండా చిక్కుతో ఉంటుంది. సాధారణ ఆహారం తింటారు. నేలపై నిద్రిస్తారు. అలాగే ఎటువంటి వస్తువులను ముట్టుకోరు. ఈ సమయంలో మహిళలు ఇంటి పని మరియు పూజ చేయటం నుంచి ఎందుకు మినహాయింపు ఉందో కారణం ఉంది. కానీ హిందూమతం ప్రకారం బహిష్టు సమయంలో మహిళలను ఎందుకు అపవిత్రంగా భావిస్తారో కారణాల గురించి తెలుసుకోవాలి.
ద్రౌపది వస్త్రాపహరణ గురించి చాలా మందికి తెలుసు.
మహాభారతంలో ధర్మరాజు పాచికల ఆటలో ద్రౌపదిని కోల్పోతాడు. అప్పుడు దుశ్శాసనుడు బహిష్టు సమయంలో ఉన్న ద్రౌపదిని రాజసభకు లాక్కొని వస్తాడు. ఆమె ఆ సమయంలో ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించి ఒక ఏకాంత గదిలో ఉంటుంది. ఆ సమయంలో బహిష్టు గురించి అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఉన్న ఒక మహిళను అవమానపరిస్తే ఎక్కువ పాపంగా పరిగణించబడుతుంది.
ఇంద్రునికి ఒకసారి అహంకారం బాగా పెరిగి,తన గురువైన బృహస్పతిని కోపంలో స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు. దాని ఫలితంగా,రాక్షసులు దాడి చేసి ఇంద్రుడి సింహాసనంను స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు తన మూర్ఖత్వంను తెలుసుకొని సహాయం కోసం  బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. బ్రహ్మ ఇంద్రుడికి తన గురువును శాంతింపచేయడానికి బ్రహ్మజ్ఞాని సేవ చేయాలని చెప్పారు. కాబట్టి,ఇంద్రుడు బ్రహ్మ జ్ఞాని సేవ చేయటానికి వెళ్ళాడు.
బ్రహ్మ జ్ఞాని వల్ల అసుర కుమారుడు జన్మించాడు. దానికి బదులుగా అతను అసురులకు స్వర్గంను త్యాగం చేసాడు. దాని పలితంగా ఇంద్రునికి చాలా కోపం వచ్చి బ్రహ్మ జ్ఞానిని హత్య చేసాడు తరువాత ఒక పువ్వులో దాక్కోన్నాడు. ఇంద్రుడు బ్రహ్మ జ్ఞానిని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాపం ఇంద్రుని వెంట ఒక భూతం రూపంలోవెంటాడింది. అందువల్ల  ఇంద్రుడు ఒక పువ్వులో దాక్కొని కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుని ప్రార్ధించాడు.
విష్ణువు ప్రత్యక్షమయ్యి భూతం నుంచి అతనికి విముక్తి కలిగించాడు. కానీ అతని తల మీద ఈ పాపం ఇప్పటికి ఉంది.  ఇంద్రుని పాపము విభజించబడింది ఈ పాపం వదిలించుకోవటానికి, ఇంద్రుడు తన పాపమును బాగాలుగా విభజించి చెట్లు, భూమి, నీరు మరియు మహిళలు తీసుకువెళ్ళాలని వేడుకున్నాడు. ఇంద్రుడు దానికి బదులుగా ఒక వరం ఇస్తానని వాగ్దానం చేసాడు.
అందువల్ల, చెట్లు అతని పాపంలో నాల్గవ వంతు తీసుకున్నాయి. ఇంద్రుడు చెట్లకు మీ వేళ్ళు మళ్లీ మళ్లీ పెరుగుతాయని హామీ ఇచ్చాడు. తదుపరి నీరు తన పాపంలో భాగంను తీసుకుంది. నీటికి ప్రతి వస్తువును శుభ్రపరిచే శక్తిని ఇచ్చాడు. తర్వాత భూమి తన పాపంలో భాగంను తీసుకుంది. భూమిపై దెబ్బ తగిలినప్పుడు స్వంతంగా మరియు సులభంగా నయం చేసుకునే శక్తిని ఇచ్చాడు.
చివరగా మహిళలు బహిష్టు సమయంలో ఇంద్రుని పాపంను తీసుకున్నారు. ఆమె బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉంటుంది. దానికి బదులుగా ఇంద్రుడు మహిళలకు పురుషుల కంటే ఎక్కువ లైంగిక ఆనందం కలుగుతుందని వరం ఇచ్చాడు. అందువల్ల ఆ సమయంలో మహిళలు ఇంద్రుని పాపం తీసుకోవటం వల్ల మహిళలు నెలలో ఒకసారి రుతుక్రమాలు మరియు ఒక బ్రహ్మ హత్య పాతకం అభియోగాన్ని కలిగి ఉన్నారు.
అందువల్ల వారు ఆ సమయంలో దేవాలయాలలోకి వెళ్ళరు.  బహిష్టు సమయంలో మహిళలు ఏకాంతంగా ఉండటానికి మొదటి కారణం ఏమిటంటే, మహిళలు ఇన్ఫెక్షన్లకు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ సమయంలో ఉంటాయి. అందువల్ల ఆమె వాటి బారిన పడకుండా నివారించేందుకు వేరే గదిలో ఉంచుతారు. రెండవది, మహిళలు ఈ సమయంలో ఇంట్లో పని చేయడం నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో మహిళ యొక్క శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల తగిన రీతిలో విశ్రాంతి అవసరం. అందువల్ల మహిళలు ఇంటి పని నుండి తమకు తాముగా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు.
బహిష్టు సమయంలో ఇతరుల నుండి దూరంగా ఉండమని సలహా కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక మహిళ యొక్క శరీరం తన చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేసే ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వక్రీకృత సాంప్రదాయాలు? కొన్ని బహిష్టు సాంప్రదాయాలను మహిళలను ఆరోగ్యంగా ఉంచటానికి ఇలాంటి ఆచారాలు పెట్టారు. అంతే కానీ ఆ ఆచారం మూఢనమ్మకాలు దారి తీయకూడదు.

Exit mobile version