త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. మన దేశంలో శివాలయాలు ఎక్కువగా ఉంటాయి. అందులో అతి ప్రాచీన అద్భుత శివాలయాలు నేటికీ దర్శనమిస్తుంటాయి. ఇది ఇలా ప్రపంచంలో శివుడి అతి పెద్ద విగ్రహం ఎక్కడ ఉందో దాని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ విధంగా ఒక్కో ఆలయంలో ఉన్న శివుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్ని విగ్రహాలకు భిన్నమైన అతి పెద్ద శివుడి విగ్రహం కర్ణాటకలోని హోనావర్ పట్టణం దగ్గర్లో శ్రీ మురుడేశ్వర ఆలయంలో ఉంది.
ఈ ఆలయంలో ప్రపంచంలో కల్లా ఎంతో ఎత్తయిన శివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ 123 అడుగుల ఎత్తుగల శివుడి విగ్రహం మనకు కనబడుతుంది.
కానీ శివుడు ప్రసాదించిన ఆత్మలింగం ఎలాంటి పరిస్థితులలో కూడా భూమిమీద పెట్టకూడదనే శరతుతో శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు.
సంధ్యావందనం పూర్తిచేసుకుని వచ్చిన రావణాసురుడు భూమిపై ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తాలని ఎంత ప్రయత్నించినప్పటికీ శివలింగం రాదు. ఈ క్రమంలోనే ఆ శివలింగంలో ఒక భాగం ఎగిరి దూరంగా పడిందని పురాణాలు చెబుతాయి.
ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతం మురుదేశ్వరాలయం అని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. శివరాత్రి వంటి మహా పర్వ దినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.