మనకు భయం వేస్తే మొదటిగా మనం తలుచుకునేది వాయు పుత్రుడినే…బలవంతుడు, ధైర్యశాలి అయిన హనుమంతునికి రామాయణంలో విశేషమైన స్థానం ఉంది. రాముడికి అత్యంత ఆప్తుడైన ఆంజనేయుడు చిరంజీవిగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే.
ఆంజనేయ స్వామి మంగళవారం లేదా శనివారం విశేష పూజలు అందుకుంటాడు.ఆంజనేయుడు సకల భయాలు, ఆందోళనలు, పారద్రోలి శక్తిని కలుగజేస్తాడు. తన భక్తితో సాక్షాత్తు ఆ పరందాముడినే తన గుండెల్లో బంధించి రాముడిపై తన భక్తిని చాటాడు.
ఆంజనేయుడికి సంబంధించిన ప్రతిమలు ఎన్నో ఉంటాయి. హనుమంతుడిని కొలిస్తే జనుల కష్టాలు ఇట్టే తొలిగిపోతాయి. మీ ఏదైనా ప్రతిజ్ఞను నెరవేర్చాలనకున్నా, ఇంట్లో సమస్యలు తొలిగిపోవాలనుకున్నా ప్రత్యేకమైన ప్రతిమను ఉంచాలి. ఉత్తరాభిముఖం అంటే దక్షిణం వైపున హనుమంతుడిని పూజించాలి.
ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తుల్లో ఏవైనా సమస్యలున్నట్లయితే మీరు తెలుపు రంగులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పూజించాలి. ఇది వృద్ధికి మార్గాలను తెరుస్తుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని లాభాల బాట పరుగులెత్తిస్తుంది. ఇంట్లో ఇలాంటి ప్రతిమను పూజించినట్లయితే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఇదే సమయంలో పని ప్రదేశంలో ఇబ్బందులున్నట్లయితే అవి తీరిపోతాయి.
ఎవరైనా వ్యక్తులు ప్రత్యేక కోరికల కోసం హనుమంతుడిని పూజించాలనుకుంటే అందుకు వివిధ రకాల ఆకారంలో పవన సుతుడి ప్రతిమను పూజించాలి. ఇలా చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. ఇందు కోసం ప్రార్థనాస్థలంలో పంచముఖ ఆకారంలో ఉన్న ఆంజనేయుడి ఫొటోను ఉంచి కొలిస్తే మంచిది. ఉదయం సాయంత్రం రెండు పూటల కోరిక నెరవేరాలని ప్రార్థించండి. ఈ విధంగా 41 మంగళవారాలు, శనివారాలు క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరతాయి.