హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సాంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది.
ఫలితం:- దీనివల్ల వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం, మంచి సంతానం పొందకపోవటం.
ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం. వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం, ఫోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి.
ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం సంస్కారం లోపించటం.
తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.
ఫలితం:- దీనివల్ల బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు.
ఫలితం:- దీనివల్ల మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొవటం.
బఫే భోజనాలు.
ఫలితం:- దీని వల్ల అన్నదాన ఫలితం పొందక పోవటం.
వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం.
ఫలితం:- దీనివల్ల దైవ కటాక్షం దూరమవ్వటం.