తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులు పూజిస్తుంటారు. అది తిరుమల శ్రీవేంకటేశ్వరుడైనా, చిలుకూరిలోని బాలాజీ అయినా.. ఇలా మరే ఇతర ప్రదేశాలలోని దేవాలయామైనా కానీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది హిందువులకి. ప్రతి ప్రదేశంలోనూ శ్రీనివాసునికి మహిమాన్విత దేవాలయాలున్నాయి. వాటిలో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని చింతల వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. క్రీ.శ. 1460 – 1525 సంవత్సరాల మధ్యలో, విజయనగర కాలంలో నిర్మించినా ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపరులను సైతం ఆకట్టుకుంటున్నది. మరి ఈ ఆలయ విశేషాలు, వెనుక వున్నా పురాణ గాధ మనం ఇపుడు తెలుసుకుందాం..