శ్రీ కృష్ణుడు యాదవులను, గోవులను ప్రళయం నుండి కాపాడటం కోసం గోవర్ధన గిరి అనే పర్వతాన్ని తన చిటికెన వ్రేలితో ఎత్తి వారిని రక్షిస్తాడు. మరి శ్రీకృష్ణుడు ఎత్తిన ఆ గోవర్ధన గిరి ఎక్కడ ఉంది? ఆ క్షేత్రంలోని విశేషాలు ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ మానసగంగ అనే సరస్సు ఉంది. ఈ సరస్సులో స్నానం చేస్తే గోహత్య దోషము పోతుందని చెబుతారు. ఇంకా భక్తులు 14 మైళ్ళు ఉన్న ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేయుదురు. అలాచేయలేని వారు మానసగంగా సరస్సుకి ప్రదక్షిణ చేస్తారు.