Home Unknown facts సంక్రాంతి కంటే ముందే ఇక్కడ వీరభద్ర స్వామి జాతర ప్రారంభమవుతుంది!!

సంక్రాంతి కంటే ముందే ఇక్కడ వీరభద్ర స్వామి జాతర ప్రారంభమవుతుంది!!

0
ఆ పరమ శివుడికి సంబంధించిన కథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సమయంలో రుద్రుని జటాజూటం నుండి ఉద్భవించిన వాడే వీరభద్రుడు. మన తెలుగు రాష్ట్రాల్లో వీరభద్ర స్వామి ఆలయాలు అరుదు. కానీ తక్కువ సంఖ్యలో ఉన్న ఆలయాలు అయినా చాలా ప్రసిద్ధి చెందాయి.
  • ఈ విధంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం ఒకటి. నిత్యం ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ విశేషాలు ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారి మహిమలు, ఆలయ చరిత్ర ఏమిటి అనే విషయాలను  తెలుసుకుందాం…
  • వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
  • ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెలసిన స్వామి వారు విగ్రహ రూపంలో కాకుండా అర్చామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ విషయానికి వస్తే కొందరు కుమ్మరులు వంట చెరుకు కోసం కొండపైకి ఎడ్ల బండితో వెళ్లారు వారు వంట చెరుకును తీసుకువచ్చి చూసేసరికి తమ ఎడ్లు మాయమయ్యాయి. అయితే తిరిగి వెళ్లడానికి చీకటి పడడంతో ఆ కుమ్మరులు ఆ కొండపైనే సేద తీరారు.
  • ఈ క్రమంలోనే వారి కలలో వీరభద్రస్వామి కనిపించి తాను కొండపై ఒక గుహలో కొలువై ఉన్నానని తనని కిందకి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పారు. ఇలా చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యాడు.
  • ఈ క్రమంలోనే స్వామి వారుకలలో కనిపించి చెప్పిన విధంగానే ఆ కుమ్మరులు గుహలోకి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకు వస్తున్న నేపథ్యంలో స్వామివారికి కాలు విరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎంతో మహిమ గల ఈ స్వామివారికి  సంతానం లేని వారు కోర మీసాలను సమర్పిస్తామని మొక్కుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు ఎక్కువగా నమ్ముతారు.
  • అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అదే విధంగా ఈ ఆలయంలో స్వామివారికి మొక్కులు మొక్కి ఆ ముక్కు నెరవేరాలని ఇక్కడ కోడె దూడలను సమర్పించడం మరొక ఆచారం. సంక్రాంతి సమయంలో ఈ స్వామివారికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో మొదటి రోజు కుమ్మరులు పాల్గొని స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. అంతే కాదు ఎడ్ల బండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు.

Exit mobile version