Home Unknown facts మొగ్గ దోసిళ్ళ నోము అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యత ?

మొగ్గ దోసిళ్ళ నోము అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యత ?

0

అన్ని మతము లలోను దేవుడు,దేవుని ఆరాధన ఉన్నది. సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము,అర్ధము, పరమార్ధము , ఒక్కటే.దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా అమ్మో , నాన్నో అని అరిచేవాడు . రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు . తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును,రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు పూజించేవాడు . పూజించడంలో చాల ఆచారాలు ఉంటాయి. వ్రతాలు నోములు అందులో ఒక భాగమే. అలాంటి నోముల్లో మొగ్గ దోసిళ్ళ నోము ఒకటి . ఈ వ్రత విశిష్టత తెలుసుకుందాం.

మొగ్గ దోసిళ్ళ నోముఒక బ్రాహ్మణ బాలిక సవతి పోరునూ, దరిద్రాన్నీ భరించలేక ప్రతిరోజూ శివలింగం ముందు దు:ఖిస్తుండగా, ఒకనాడు శివదేవుడు ప్రత్యక్షమై అమ్మాయి గతంలో నువ్వు మొగ్గ దోసిళ్ళ నోము నోచి ఉల్లంఘించడం వల్లనే నీకీ కష్టం వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆ నోమును యాధాప్రకారం ఆచేరిస్తే, సవతి తల్లి పోరూ తప్పుతుంది. సర్వ దరిద్రాలూ తొలిగిపోతాయి అని చెప్పాడు.

ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఒక పళ్ళెంలో పసుపు పోసి, దానిమీద మూడు దోసిళ్ళ నీరు పోసి, దానిని వంటికి రాసుకుని శివుణ్ణి స్మరించాలి. పై కథ చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఏడాది తరువాత ఉద్యాపన చేయాలి. మూడు దోసిళ్ళ పువ్వులూ, మూడు దోసిళ్ళ పగడాలు, మూడు దోసేళ్ళముత్యాలూ తీసుకుని శివాలయానికి వెళ్లి , శివుడికి వాటిని ధారబోసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.

అది విన్న బాలిక ఆ విధంగానే చేయగా ఏడాది గడిచేసరికి సవతి తల్లికి మనసు మారి, ఆ కన్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. అంతలోనే సంపన్నుల యింటి సంబంధం వచ్చి, ఆమెకు ధవంతుడైన యువకునితో వివాహం జరిగి దరిద్రమూ తొలగిపోయింది.

 

Exit mobile version