Home Unknown facts శివుడు పార్వతీదేవికీ జీవిత రహస్యం వివరించిన ప్రదేశం

శివుడు పార్వతీదేవికీ జీవిత రహస్యం వివరించిన ప్రదేశం

0

భారతదేశంలో ఉత్తరంవైపు వున్న అమరనాథ్ పర్వతాలలోని అమర్ నాథ్ గుహలు హిందువులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం. ఈ అమర్ నాథ్ గుహలోపల ఒక మంచు శివలింగంలా కనిపించే ఆకృతిని కలిగి వుంటుంది. ఇది వేసవి కాలమయిన మే నుండి ఆగస్టు వరకు పెరిగి ఆ తరువాత కరుగుతుంది.

అమర్ నాథ్ గుహపురాణాల ప్రకారం శివుడు తన భార్య అయిన పార్వతీదేవికీ జీవిత రహస్యం, సనాతనం గురించి ఇక్కడే వివరించారు.

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు పార్వతీదేవి, ఈశ్వరుడితో ‘‘నాథా! మీరు కంఠంలో వేసుకునే ఆ పుర్రెమాలగురించి నాకు వినాలని వుంది’’ అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు… ‘‘పార్వతీ! నువ్వు జన్మించిన ప్రతిసారి నేను ఈ పుర్రెలమాలలో ఇంకొకటి అదనంగా చేర్చుకుని ధరిస్తుంటాను’’ అని బదులిచ్చాడు.

పార్వతీదేవి ‘‘నేనే మరణించి, తిరిగి జన్మిస్తూనే వుంటాను. కానీ నువ్వు మాత్రం అలాగే శాశ్వతంగా అమరుడిగా వుంటున్నావు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగింది.

ఈశ్వరుడు ‘‘పార్వతీ! ఇది ఎంతో రహస్యమైంది. కాబట్టి ఏ ఒక్క ప్రాణిలేని ప్రదేశంలో నీకు వివరంగా చెప్పాలి’’ అని చెప్పి ఏ ప్రాణజీవి లేని అమరనాథ్ గుహ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఇలా ఈ విధంగా శివుడు పహల్ గాం వద్ద నందిని వుండమని ఉపదేశించి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలివెళ్లాడు. అలాగే పాములను, గణేషుడిని, పంచభూతాలను ఆకాశంలో తమతమ ప్రదేశాలలో వదిలేసి ఈ అమరనాథ్ గుహలకు చేరుకున్నాడు.

ఆ ప్రదేశంలో వున్న అన్యప్రాణులను ఇతర ప్రదేశాలకు పంపి, తన అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడే పైనున్న ఒక పావురాల జంట గుడ్లరూపంలో ఈ అమరత్వ రహస్యాన్ని విని.. అవి కూడా అమరులు అయ్యాయని కథనం.

 

Exit mobile version