ఆడవారికి కేశాలు ఎంతో అందాన్ని ఇస్తాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో స్త్రీలు జడ వేసుకొని పూలు ధరిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఆడవారు జడ వేసుకోవడం తప్పనిసరి. ఇప్ప్పుడు జుట్టు విరబోసుకోవడం.. వి కట్..యూ కట్, ఫెథర్ కట్ అంటూ రకరకాలుగా జుట్టుని కత్తిరించుకుని విరబోసుకుని ఉండడం ఫ్యాషన్ అయిపొయింది కానీ..రెండు తరాల ముందు వరకూ అమ్మాయిలకు జడ వేసుకోవడం తప్పనిసరి.. చిన్న పిల్లలు రెండు జడలు వేసుకుంటే.. యువత ఒక జడను .. అమ్మతనం నుంచి ఒక అడుగు ముందుకు వేస్తె.. ముడి వేసుకునేవారు. అంతేకాదు.. అప్పట్లో అమ్మాయిలు జడ వేసుకుని.. వాటికీ ప్రత్యేకమైన భరణాలను జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ముఖ్యమైనవి అలంకరించుకునేవారు.
అయితే ఈ విధంగా మూడు పాయాలే ఎందుకు తీసుకొనేవారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీ జడ మూడుపాయలకు తన భర్త,తాను,తన సంతానం అనే అర్థాన్ని సూచిస్తాయి.
సత్వ, రజ, తమో గుణాలు,