దేవాలయంలో వెలసిన స్వామికి కొన్ని పండుగ పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఈ ఆలయంలో ఏడాదిలో ఒకసారి మాత్రమే భక్తులు కొన్ని వేల సంఖ్యల్లో వస్తుంటారు. మరి ఆ ఒక్క రోజు మాత్రమే ఎందుకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, కళింగ పట్నం కి దగ్గరలో ఉన్న బోరవని పేట గ్రామం, వంశధార నది ఒడ్డున సాలిహుండంలో కొండపైన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉంది. స్తల పురాణం ఆధారంగా శాలివాహన కాలం నుండి కొండపైన ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామిగా పిలుస్తారు.