Home Unknown facts వెయ్యి సంవత్సరాల క్రితంనాటి ఆనందగిరి లో ఉన్న విశేషం ఏంటో తెలుసా ?

వెయ్యి సంవత్సరాల క్రితంనాటి ఆనందగిరి లో ఉన్న విశేషం ఏంటో తెలుసా ?

0

శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే ఇక్కడి కొండ పడుకున్న నంది ఆకారంలో ఉంటుంది. మరి అతి పురాతన ఆలయమని చెప్పబడే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నంది ఆకారంలో కొండ

కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపుర్ జిల్లా, బెంగుళూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నంది దుర్గ ఉండగా ఇక్కడే భోగనందీశ్వరుని ఆలయం ఉంది. ఇది అతిప్రాచీన పర్వత కోట గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కొండలు మూడు గ్రామాలను కలుపుతూ విస్తరించి ఉన్నవి. ఒకప్పుడు ఈ నందికొండల గ్రామాన్ని ఆనందగిరి అని పిలిచేవారట.

పూర్వం ఈ ప్రాంతంలో యోగి నందీశ్వరుడు తపస్సు చేసుకునేవాడట, అందుకే ఆ యోగి పేరుమీదుగా నంది కొండలు, నందిదుర్గ గా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ పడుకున్న నది ఆకారంలో ఉండగా, సుమారు 1200 సంవత్సరాల క్రితం ద్రావిడ సంప్రాదయ వాస్తురీతిలో నందీశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. ఈ కొండమీద శివపార్వతుల ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో ఉన్న నందిని భోగనందీశ్వరుడని అంటారు. ఇక్కడ ఒక సరస్సు ఉండగా, ఈ సరస్సుని కళ్యాణిచెరువుగా పిలుస్తారు. అయితే ఈ కొండపైన ఉన్న ఒక కోట ఉండగా, టిప్పుసుల్తాన్ ఈ కోటను నిర్మించనట్లుగా చెబుతారు.

ఇక్కడి నంది కొండ, కొండమీద ఉన్న ఆలయంలోని శిల్పకళానైపుణ్యం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈవిధంగా పడుకున్న నంది ఆకారంలో ఉన్న కొండపైన కొలువై ఉన్న భోగనందీశ్వరుడని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version