ఇటీవల రోజుల్లో వయసు తేడా లేకుండా అందరిలో కనిపిస్తున్న సమస్య కిడ్నీల్లో రాళ్ళూ. మూత్రపిండంలో లేదా మూత్ర నాళంలో ఏర్పడిన ఒక స్ఫటిక ఆకారంలో ఉండే ఘన పదార్థాన్ని కిడ్నీ లో రాళ్ళూ అంటారు. మూత్ర పిండాల్లో రాళ్ళూ ఉండే స్థితిని నిఫిరోలిథియాసిస్ అంటారు. మరియు మూత్ర నాళంలో రాళ్ళూ ఉండే స్థితిని యూరలిథియాసిస్ అంటారు.కిడ్నీ రాళ్ళు అనేవి శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఏర్పడతాయి .
కిడ్ని లో రాళ్ళూ ఉంటే తరచుగా కడుపు, నడుము భాగంలో తీవ్ర నొప్పిని కలిగిస్తాయి. ఈ మధ్య చాలామంది కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు కారణం… మారిన జీవన విధానం, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం,కృత్రిమ ఔషధాలతో పండించే ఆహారం తినడం , సమయానికి తినకపోవడం, నీరు తక్కువగా త్రాగటం లాంటివి ప్రధాన కారణాలు.అయితే మూత్ర పిండాల్లో రాళ్ళూ 4 రకాలు ఉంటాయి.
1. కాల్షియం:
->బంగాళదుంప చిప్స్
->వేరుశెనగ
->చాక్లెట్
->దుంపలు
->పాలకూర ఇలాంటి పదార్థాలలో ఉండే ఒక్స్లాటే వాళ్ళ ఏర్పడతాయి.
2. యూరిక్ ఆమ్లం:
3. స్ట్రువిట్ :
4. సిస్టైన్:
ఒక సర్వే ప్రకారం ఆడవారి కంటే మగవారిలో ఎక్కువ శాతం మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య ఉందని వెల్లడించారు. 20 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో మూత్రపిండాలు రాళ్ళు ఎక్కువగా సంభవిస్తాయి.
మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి . బయట దొరికే జంక్ ఫుడ్ తక్కువ తినాలి. నిమ్మరసం త్రాగటం, పండ్ల రసాలు త్రాగటం వల్ల ,శుద్ధమైన నీటిని ఎక్కువ తీసుకోవటం( రోజుకు సుమారు 4 లీటర్ల నీటిని త్రాగాలి). తరచు వ్యాయామం చేయటం వల్ల మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యను చాల వరకు తగ్గించవచ్చు.