జీవితంలో చావు, పుట్టుకలు అనేవి ప్రతి మనిషికి వస్తాయి. అయితే జన్మించడం, మరణించడం అనేవి మన చేతుల్లో ఉండవు అదిఅంతా దైవ నిర్ణయంగా భావిస్తాం. ఒకరు చనిపోతే మళ్ళీ బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఈ పవిత్ర క్షేత్రంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ చావు బతుకుల ఉన్న వారిని ఇక్కడికి తీసుకొస్తే వారి ఆయుష్షు కొన్ని నిముషాలు పెరుగుతుందని అంటున్నారు. అసలు ఆలా అనడానికి గల కారణాలు ఏంటి? ఆ పవిత్రస్తలం ఎక్కడ ఉంది? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో జాన్సర్ బవర్ ప్రదేశంలో లఖ్ మండల్ మందిర్ అనే దేవాలయం ఉంది. ఇది ఒక పురాతనమైన హిందూ దేవాలయం ఇంకా మహాశివునికి అర్పితమైన పవిత్రమైన స్థలం. ఈ ఆలయం ఎంతో మహిమ కలదిగా ప్రసిద్ధిచెందింది. ఈ దేవాలయాన్ని సందర్శించివారు తమ దురదృష్టాన్ని దూరం చేసుకుంటారని కూడా చెప్పవచ్చును.
లఖ్ మండల్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. లఖ్ అంటే ‘అనేకం’ మరియు మండల్ అంటే ‘దేవాలయం’ లేదా ‘లింగం’ అనే అర్థాన్ని కలిగివుంది. ఇక్కడ భారతదేశం యొక్క పురాతత్త్వశాస్త్ర సమీక్షకు సంబంధించిన కళాత్మకమైన కృతులు ఇక్కడ చూడవచ్చును. ఈ దేవాలయం ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే ఇక్కడి ఆలయంలోని శివలింగం గ్రానైట్ తో చేయబడింది. అందుకే చుట్టుపక్కల ఆ లింగం యొక్క ప్రకాశానికి ఎంతో అందంగా కనపడుతుంది. ఆ లింగాన్ని చూసిన భక్తులు ఎంతో భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు.
ఇక్కడి స్థలపురాణం ప్రకారం, మహాభారతంలో దుర్యోధనుడు ఒక లక్కగృహంలో భాస్కరుడుని జీవంతోనే కాల్చేయాలని ఒక ఇంటిని నిర్మాణం చేస్తాడు.ఆ గృహమే ప్రస్తుతదేవాలయం వుండే ప్రదేశం మరియు చుట్టుపక్కల ప్రదేశం అని నమ్మటం జరిగింది. దనావ మరియు మానవ అనే కవల ప్రతిమలు ముఖ్యంగా దేవాలయం పక్కన వున్నవి.ఈ ప్రతిమలను కొందరు పాండవ సహోదరులైన భీముడు మరియు అర్జునుడు అని నమ్ముతారు.
అయితే దనావ మరియు మానవ ప్రతిమలు విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ మరియు విజయులని చెప్తారు.ఎవరైనా చనిపోయిన సమయంలో లేక చనిపోతున్నప్పుడు ఈ విగ్రహాలను వారి ముందు తీసుకువెళతారు. ఆ తరువాత మహాశివుని పవిత్రమైన అభిషేక జలాన్ని చనిపోయిన మానవునికి లేదా చనిపోతున్న మనిషికి త్రాగిస్తే కొన్ని నిమిషాలకాలం పాటు బ్రతుకుతారని స్థానికులు చెప్పుతున్నారు. ఇది ఆ పరమ శివుని శక్తిని కలిగిన పవిత్రమైన స్థలం అని అందరు నమ్ముతారు.
ఈ స్థలానికి దగ్గరలోనే ఒక ధుంధి ఓడారి అని పిలవబడే గుహ వుంది.స్థలపురాణం ప్రకారం దుర్యోధనుని నుండి కాపాడుకోవటానికి పాండవులు ఈ స్థలంలో నివాసమున్నారు అని చెబుతున్నారు. శివుని పవిత్ర స్థలంగా బావిచే ఈ ఆలయంలో చనిపోయే వ్యక్తికి అక్కడి జలాన్ని తాగించి వారి చావుని కొన్ని నిముషాలు ఆపవచ్చని ఇక్కడి భక్తుల నమ్మకం.