మన హిందూ సంప్రదాయంలో జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇక నాడి జ్యోతిష్యం గురించి వాస్తవాలు ఇప్పటికి అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇదే విషయం పైన కొందరు పండితులు ఏం అంటున్నారు అంటే, నాడీజ్యోతిశ్యం అనేది నూటికి నూరు శాతం నిజమని నాడి శాస్రంలోని రహస్యాలు అసత్యం కాదని వారు చెబుతున్నారు. మరి నాడి జ్యోతిష్యం అంటే ఏంటి? దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మంత్రగ్రంథాలలోతమిళ, పైశాచిక (?) గ్రంథాలు హెచ్చు. వీటిలో తిరిగి రెండు రకాలున్నాయి. మొదటిరకంలోని తాళపత్ర గ్రంథాలలోఅర్థంకాని భాష ఉంటుంది. ఇది ప్రాచీన తమిళం సెందమిళం అని కొందరు చెబుతారు. మామూలు తమిళం వచ్చినవారు కూడా దీనిని చదువలేరు, అర్ధం చేసుకోలేరు. రెండవ రకానికి చెందినవే అసలుమంత్రనాడీగ్రంథాలు. వీటిలో తాళపత్రాలు ఖాళీగా ఉంటాయి. కాని చదివేటప్పుడు విచిత్రభాషలో అక్షరాలు కనిపించి మాయమవుతాయి. దీనికి మంత్ర సిద్ధి ఉంటుంది.
ఇది ఇలా ఉంటె, బీవీ రామన్ గారు 1938 లో శ్రీనివాసాచారి అనే నాడీ జ్యోతిష్కుని కలిసారు. ఆయన వద్ద బుధనాడి అనేగ్రంథం ఉన్నది. ఈయన జీవితం అంతా విషాదంతో నిండి ఉంది. మూడుసార్లు పెళ్లిచేసుకున్నాడు. కానీ మొదటి ఇద్దరు భార్యలు విషాద పరిస్థితులలోచనిపోయారు. శ్రీనివాసాచారిగారి అభిప్రాయం ప్రకారం నాడిగ్రంథం ఇంటిలోఉండరాదు. ఒకవేళ ఉంటే, ఆ కుటుంబం మీద శాపం ఉంటుంది. చాలా నాడీగ్రంథాలు క్షుద్ర మంత్రములపైన ఆధారపడి ఉంటాయి. ఆయా క్షుద్ర దేవతలను ప్రతి రోజూ తృప్తిపరచాలి. తేడా వస్తే ఫలితములు దారుణంగా ఉంటాయి. వాటిని తృప్తిపరిచే విధానాలు వేర్వేరుగా ఉంటాయి.
ఈ జ్యోతిష్కులలో కొందరికి పంచాంగుళీ మంత్రసిద్ధిఉంటుంది. పంచాంగుళీ మాతహస్తసాముద్రిక విధానానికి అధిదేవత. ఈ దేవతా కటాక్షం వల్ల ఫలితములుఎక్కువ కష్టపడకుండా తేలికగా చెప్పవచ్చు. ఈమె అంత ప్రమాదకారికాదు. కొంచం సాత్వికదేవత. అసలు వీరందరూదేవతలు కారు. దేవతల కంటే కొంచం స్థాయి తక్కువవారు. కాని మానవాతీతశక్తులు ప్రసాదించ గలిగినవారు. వీరిలోఎక్కువ మంది భయంకరమైన ఆకారం కలిగి ఉంటారు. భయాన్ని జయించిన సాధకుడు మాత్రమె వీరిదర్శనాన్ని తట్టుకోగలుగుతాడు. లేకపోతే వీరి దర్శనం వల్ల మతిభ్రమణం వంటి చేదు పరిణామాలు కలుగుతాయి.
మంత్ర నాడి తెలిసిన వారికి సాంప్రదాయ జ్యోతిష్యం కూడా కొంత తెలిసి ఉంటుంది. కొందరికి అసలుతెలియదు. రెండవరకానికి చెందిన వారు పైశాచికభాష చదవటం నేర్చుకొని ఉంటారు. తాళపత్రంలో ఉన్న భాషను, లేక అప్పటికప్పుడు కనిపించి మాయం అయ్యే మాటలను చదివిచెప్పగలరు. అంతవరకే వారి ప్రజ్ఞాపాటవాలు పనిచేస్తాయి. దానిని మించి వారికి జ్యోతిష్యజ్ఞానం ఉండదు.
వైదీశ్వరన్ కోయిల్, కంచి, మద్రాసు, కుంభకోణం, ఇంకా తమిళనాడు లోని అనేక నగరాలలో నాడీజ్యోతిష్కులు ఎక్కువగా కనిపిస్తారు.