కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకారిగా మారింది. అది ఎటు నుంచీ మనపై దాడి చేస్తుందో తెలియదు. ఐతే దాడి చేసినా ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మనం మంచి ఆహారం తినాలి. పుష్టిగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. పొరపాటున కరోనా వైరస్ బారిన పడితే అప్పుడు మనం భయపడకుండా ముందు నుంచే పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే బాడీలోకి వెళ్లిన వైరస్ మనల్ని ఏమీ చెయ్యలేక చేతులెత్తేస్తుంది. అలా జరగాలంటే మనం మంచి ఆహారం తినాలి. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకోవాలి. మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ముందు వైరస్ పవర్ తేలిపోవాలి.