మనం తీసుకునే ఆహారమే అనేక రోగాలకు ఔషధం. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం అవసరం. అది సరిగా.. పనిచేసినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేల రోగనిరోధిక శక్తి సరిగా పనిచేయకపోతే… శరీరంలోకి బాక్టీరియా, ఫంగస్, వైరస్ లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటన్నింటిని బయటకు పంపిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిచడానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా.. స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే రోగనిరోధిక శక్తి ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మరి ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు, అవి కూడా మన వంటగదిలోనే ఉన్నాయి. మరి అవేంటో తెల్సుకుందాం..
వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రుచికరమైన ఆహారంలో జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టిరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరి చేరనివ్వదు.
ఈ ఆహారాలే కాకుండా, ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని చిట్కాలు కూడా పాటించాలి.. రోజూ వ్యాయామం చేయడం, తరచుగా షుగర్ లెవెల్స్ చూసుకోవటం, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటం.. 8 గంటలు నిద్రపోవటం.. లాంటి నియమాలు పాటిస్తే ఎలాంటి వైరస్ లు మిమ్మల్ని ఎం చేయలేవు