హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలుచుకోరు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందని అంటారు. అయితే సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. ఇది ఇలా ఉంటె కొన్ని ఏళ్ళ నాటి శని పోవాలంటే ఈ ఆలయాన్ని దర్శించాలని చెబుతున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రము, కాంచీపురం జిల్లా, శ్రీ పెరంబదూర్ అనే పట్టణంలో ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఉంది. ఇది చెన్నై నగరానికి పశ్చిమ దక్షిణ దిశలో 60 కీ.మీ. దూరంలో ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైన దివ్యక్షేత్రం. ప్రధాన ఆలయ మంటపంలో రామానుజ గురుదేవుల ప్రతిమతో పాటు గా యతిరాజానంత వల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టించారు. ఇక్కడి గజస్తంభానికి బంగారు తొడుగు ఏర్పాటు చేయబడింది.
అయితే ఖగోళ శాస్త్రంలో సూర్యునిచుట్టూ 8 గ్రహాలు వుంటాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మానవుని జీవితం మీద నవగ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఖగోళంలో వున్న గ్రహాలకూ, నవగ్రహాలకు కొన్ని వ్యత్యాసాలున్నాయి. సాటర్న్ దివ్య నవగ్రహాలలో ఒకటి. మనుష్యుల జీవితావధిలో మూడు సార్లు ప్రవేశిస్తుంది అనేదే జ్యోతిష్యశాస్త్రం. పుంగుశని.మంకుశని మరియు మరణశని అనే రూపంలో శనీశ్వరుడు ప్రవేసిస్తాడు. పుంగుశని మంచిదని మరియు మంకుశని మరియు మరణశని చెడ్డదని చెప్తారు.
ఇవంతా మనుష్యుల జన్మకుండలి మరియు క్రిందటి జన్మల పాప ఫలాల అనుగుణంగా శని మంచిది లేదా చెడ్డది చేస్తాడు. శని మానవజీవితంలో ప్రవేశించిన తర్వాత ఏడున్నర సంవత్సరాల కాలం వుంటాడని నమ్ముతారు. అదేవిధంగా ఆ ఏలినాటిశని వున్న సమయంలో అయ్యే నష్టం,దుష్టపరిణామాలు తగ్గించుకోవటానికి ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు వస్తుంటారు.
ఈ దేవాలయం శనిదేవునికి అంకితం చేయబడింది. తులసిమాలను సమర్పించి ఇక్కడి శని భగవంతుడిని ఆరాధిస్తారు. ఈ దేవాలయంలో వందలకొలది భక్తులు ప్రతినిత్యం స్వామి దర్శనానికి వస్తారు. విశేషమేమిటంటే ఈ దేవాలయానికి వచ్చేభక్తులు తులసిమాలను స్వామికి సమర్పించి భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఏలినాటిశని ప్రభావం నుంచి బయటపడుతారని నమ్ముతారు. అంటే జీవితంలో ఉత్తమమైన అభివృద్ధిని శనిదేవుడు కరుణిస్తాడని భక్తుల నమ్మకం.