శివుడు కొలువై ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో వేములవాడ కూడా ఒకటిగా చెబుతారు. వేములవాడ లో వెలసిన ఈ రాజన్న దర్శనం తరువాత ఎక్కువ మంది దర్శించే ఆలయమే భీమేశ్వరాలయం. మరి ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి వారు? ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ భీమేశ్వరాలయం లో నిత్యం ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రం నిరంతరం శ్రావ్యముగా, భక్తజనులకు ఆలయం నలుమూలాల నుండి వినిపించబడును. ఇలా ఎంతో ప్రసిద్ధమైన ఈ దేవాలయానికి వేములవాడ రాజన్న దర్శించిన తరువాత భక్తులు తప్పకుండ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.