మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది. మహాభారతం నేటికీ మనకు చాలా నేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటె.. తెలియనివి ఎన్నో ఉన్నాయి.
మహాభారతాన్ని తెలియజేసే ఆ పువ్వు ఏంటి ? ఆ పువ్వు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… మన హిందూ ధర్మంలో పంచమవేదంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మహాభారతం మొత్తం ఒక పువ్వులో ఏర్పడి ఉంది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ పుష్పంలో ఎన్నో వింతలు ఉన్నాయి.
అంత విశిష్టత కలిగిన ఈ పుష్పాన్ని కృష్ణ కమలం అని పిలుస్తారు. వాడుక భాషలో ఈ పుష్పాన్ని కౌరవ పాండవ పుష్పం అని కూడా పిలుస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ పుష్పం ఏడాది మొత్తం మనకు కనిపించదు. కేవలం మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పించడం ఈ కృష్ణ కమలం ప్రత్యేకత.
చూడటానికి ఎంతో చిన్నగా తెలుపు రంగులో ఆహ్లాదంగా కనిపించే ఈ పుష్పంలో ఇంత సమాచారం ఇమిడి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది పుష్పం చుట్టూ చిన్నని పుసన్నని తీగవంటి రేకులు కలిగి ఉంటాయి ఇవి మొత్తం 100 ఉండటంతో వీటిని కౌరవులుగా భావిస్తారు.
ఈ ఐదు రెక్కలను పాండవులకు సూచిక. ఈ ఐదు రెక్కల పై మూడు రెక్కలు కొలువై ఉంటాయి వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కొలుస్తారు.
వీటి కింద భాగంలో సుదర్శనచక్రాన్ని పోలిన ఆకారం ఉంటుంది. దీనిని శ్రీకృష్ణుడిగా భావిస్తారు.
ఇలా ఈ పుష్పంలో మహాభారత సమాచారం ఉండడం చేత ఈ పుష్పాన్ని కౌరవ పాండవ పుష్పం లేదా కృష్ణ కమలం అని కూడా పిలుస్తారు.