బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు కలియుగ వరదుడు. వక్షస్థలంలో లక్ష్మి నివాసితుడైన శ్రీశ్రీనివాసుడికి నిత్య సేవలు జరుగుతాయి. కలి పాపాల నుంచి ప్రజలను కాపాడటం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఏడుకొండలపై వెలిసినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి.
అయితే తిరుమలలో వెలసిన స్వామి వారు తన కొండకు చేరి దర్శించుకోలేని భక్తుల కోసం పలు ప్రాంతాలలో వెలిశాడని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం తమిళనాడు శ్రీరంగం సమీపంలో గల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో వేంకటేశ్వరుడు కనిపించి కృష్ణా నది తీరాన మన్యంకొండలో వెలుస్తానని అక్కడికి వెళ్లి నిత్య పూజలు చేయాలని చెప్పడంతో అళహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబసభ్యులతో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి, మన్యం కొండపై శేషసాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి అప్పటి నుంచి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం ప్రారంభించారు.
స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించే భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు.