నవ్వించి కవ్వించే సినిమాలు కొన్ని, ఏడ్పించే సినిమాలు కొన్ని, విసుగు తెప్పించే సినిమాలు మరి కొన్ని. అంతేనా అంటే కాదు, కొన్ని సినిమాల్లోని పాత్రలు మనల్ని వెంటాడుతాయి, మన ఆలోచనల్ని, మనం ఆచరించే పద్ధతుల్ని ప్రశ్నిస్తాయి. మనం బ్రతుకుతున్న సమాజంలోని తప్పు ఒప్పులని మనకు వివరిస్తుంది సినిమా . ఇలా మన మనస్సులో చెరగని ముద్ర వేసిన సినిమాలు చాల అరుదుగా వస్తాయి.
ఈ చిత్రంలోని పాత్రల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, సంఘటనల ద్వారా దర్శకుడు వెంకటేష్ మహా అంతర్లీనంగా నేటి సామాజానికి చెప్పాలి అనుకున్న కొన్ని విషయాలు ఒకసారి విశ్లేషించుకుందాం……!
సుందరం – సునీత
ఉదాహరణ: ఒక సన్నివేశంలో సుందరం తన తండ్రితో పూజలో కూర్చొని, వినాయకుడితో సునీతని తనతో మాట్లాడేలా చేయమని కోరుకుంటాడు. సుందరం కోరుకున్నది జరగడంతో దేవుడి మీద భక్తి పెరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల సునీత దూరం అవ్వడంతో, అదే దేవుడి మీద నమ్మకం కోల్పోయి తన తండ్రి చేసిన విగ్రహాన్ని రాళ్ల తో కొడతాడు. ఇక్కడే సుందరం దేవుడి మీద ఉన్న కోపంతో మతం మరడమే కాదు తన పేరుని ‘జోసెఫ్’గా మార్చుకుంటాడు.
జోసెఫ్ – భార్గవి
ఇక్కడ జోసెఫ్ మతం మరకపోయి ఉంటే భార్గవితో పెళ్లి జరిగేదేమో ???
గెడ్డం – సలీమా
సలీమా చేసే వ్యభిచారం, తన ప్రవర్తన నచ్చని కొందరు మతం ముసుగులో సలీమని కొట్టడంతో, తాను గెడ్డంతో పెళ్ళికి ముందే చనిపోతుంది.
రాజు – రాధా
ఈ ఇద్దరి పాత్రల ద్వారా, ఆ వయస్సులో ఉన్నవారికీ కేవలం ఒక తోడు అవసరమే తప్ప, శారీరక సంబంధం కోసం వెంపర్లాడారు అనేది చెప్పలనుకున్నాడు దర్శకుడు వెంకటేష్ మహా.
ఇలా అంతర్లీనంగా, సుందరం-జోసెఫ్-గెడ్డం-రాజు, అనే పాత్రల ద్వారా సమాజం లోని వయస్సు, కులం, మతం, అంతస్థులు, అనే మనిషి నిర్మించుకున్న గోడలతో పాటు సమాజంలోని తప్పు ఒప్పులను, దర్శకుడు చెప్పకనే చెప్పేసాడు.
వయస్సు, కులం, మతం, పేద-గొప్ప లాంటి అంతర్యాలను అందరికి అర్ధమయ్యేలా, ఒక కనువిప్పును కలిగించేలా చెప్పాడు కాబట్టే ఈ సినిమా అందరిని కదిలించింది.