మన దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో జ్వాలాముఖి ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని జ్వాలాముఖి అని పిలుస్తారు. ఇక్కడి విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక చిన్న గుంటలో ఉన్న రంద్రం నుండి మంట అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా నుండి దక్షిణంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి అనే ఊరిలో ఈ జ్వాలాముఖి ఆలయం ఉంది. మెయిన్ రోడ్డులో ఒక చిన్న కొండమీద ఈ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం కలదు. అయితే 51 శక్తిపీఠాలలో ఈ జ్వాలాముఖి ఒకటి. సతీదేవి యొక్క నాలుక పడిన ప్రదేశంగా భక్తులు భావిస్తారు.