పురాతన కాలంలో వెలసిన దేవాలయాలు ఎక్కువగా రాజులూ కట్టించినవే అని చెబుతారు. అయితే ఇక్కడ వెలసిన శ్రీ మహావిష్ణువు ఆలయం మాత్రం నూనె అమ్ముకునే సాధారణ స్త్రీ ఇక్కడ ఆలయాన్ని కట్టించినది ఇంకా ఈ స్త్రీ తక్కువ జాతికి చెందిన స్త్రీ అని స్థల పురాణం ద్వారా తెలియుచున్నది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆమె గుడి ఎలా నిర్మించిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే, స్వామివారి విగ్రహానికి వివిధ రకాలుగా వస్త్రధారణ చేస్తారు. ఉదయం పూట విష్ణుమూర్తిని బాలుని వలె వస్త్రములతో అలంకరింబడగా, మధ్యాహ్నం యువకుని వలె, రాత్రికి వృద్ధిని వలె అలంకరించబడతాడు. ఇంక్కా విష్ణుమూర్తి తల పాగాను అనేక తరాల నుండి ఒక కుటుంబం వారే నేయుట ఒక ప్రత్యేకత.