భారతీయ జ్యోతిష శాస్త్రం మీద కనీస అవగాహన ఉన్నవారు ఎవరైనా, శని దేవుని పట్ల కూసింత భయాన్ని కలిగి ఉంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదు.
అయినప్పటికీ, అనేకమందికి హిందూ పురాణాలకు సంబంధించిన జ్ఞానం పాక్షికంగానే ఉన్న కారణాన, శని దేవుని ప్రతికూల ప్రభావాల బారిన పడడం సర్వసాధారణంగా ఉంటుంది. శని దేవుడు ఎవరినైనా చూడాలని నిర్ణయించుకుంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా నాశనం చేయబడతాడు. అలాగని శని దేవుడు క్రూరమైన దేవుడేమీ కాదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది?
శని దేవుడిని పూజించడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయని చాలామంది అపోహ పడుతుంటారు.
కానీ వాస్తవానికి అది ఏమాత్రం నిజం కాదు. నవగ్రహాలలో శనిగ్రహం ఒక్కటి.
శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి, సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి శని పూజ ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం…
మనకు శనీశ్వరుని దేవాలయం అందుబాటులో లేకపోతే, నవగ్రహాలకు వెళ్లి శనీశ్వరుని దర్శించుకోవాలి.
అలా వెళ్లేటప్పుడు నల్లటి నువ్వులను తీసుకొని, నవగ్రహాలలోని శని పాదాల ముందర వాటిని సమర్పించాలి. అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరునికి తలనుండి పాదాల వరకూ వచ్చేలా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అలాగే నల్లటి వస్త్రమును తీసుకొని శనీశ్వరుని మెడలో మాలగా వేయాలి. శనీశ్వరుని పూజ చేసేటప్పుడు ముదురు నీలం రంగు దుస్తులు లేదా నలుపు రంగు దుస్తులు ధరించాలి. శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.
అలా చేయడం ద్వారా శుభఫలితాలు కలుగవని పండితులు చెబుతున్నారు.