దుష్టులను శిక్షించడానికి, భక్తులకు రక్షించడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను అని చెప్పాడు. విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలో ధర్మాన్ని నిలబెట్టాడు. ఈ విషయం మనకు తెలుసు అయితే ఆది దంపతులైన శివుడుపార్వతి కూడా పది అవతారాలు ధరించి లోకకల్యాణం చేసారు. అయితే ముందుగా అవతారం ఇంతే ఏంటో తెలుసుకుందాం. అవతారం అంటే దిగుట, పైనుండి క్రిందికి రావడం. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండే దేవుడు లోక క్షేమం కోసం భూలోకం వచ్చెనని అర్ధం.
మాహాకాళుడు , ఈయన అర్ధాంగి ” మాహాకాళి” వీరిద్దరు భక్తులకు ముక్తినిచ్చే దైవాలు
ద్వితీయ అవతారం :
తారకావతారము , ” తారకాదేవి ” ఈయన అర్ధాంగి . సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు .
తృతీయావతారం :
బాలభువనేశ్వరావతారము – సహచరి ” బాలభువనేశ్వరీ దేవి ” సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు .
చతుర్ధావతారం :
షోడశ విశ్వేశ్వరుడు – ” షోడశ విద్యేశ్వరి ” ఈయన భార్య . భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు .
పంచమ అవతారం :
భైరవ అవతారము – భార్య ” భైరవి ” ఉపాసనాపరులకు కోరికలన్ని తీర్చే దైవం భైరవుడు .
భిన్నమస్త — భిన్నమస్తకి ఈయన పత్నీ.
ఏడవ అవతారం :
ధూమవంతుడు — ధూమవతి ఈయన శ్రీమతి .
ఎనిమిదవ అవతారం :
బగళాముఖుడు — బగళాముఖి ఈయన భార్య .. ఈమెకు మరో పేరు బహానంద
మాతంగుడు — మాతంగి ఈయన భార్య .
పదవ అవతారం :
కమలుడు — కమల ఇతని అర్ధాంగి .
శివశక్తులు కలిసి ఇన్ని అవతారాలు ధరించిన సంగతి చాలా వరకు తెలియదు.