Home Unknown facts విష్ణు మూర్తి మోహినిగా మారి భస్మాసురుని ఎందుకు వధించాడు?

విష్ణు మూర్తి మోహినిగా మారి భస్మాసురుని ఎందుకు వధించాడు?

0

శాపం తిట్టులాంటిది. వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి.అదేలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాల్లోని ఒక కథను మీరు తెలుసుకోవాల్సిందే. కథేంటంటారా వరాన్ని, శాపంగా మార్చుకున్న బస్మాసుర కథ.

Vishnu Murthyహిందూ పురాణాలలో భాస్మసురిని కధలో శివుడు లేదా భస్మాసురుడు, మోహిని ఉంటారు. భారతీయ పురాణాలలో దేవతలు, రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది. రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన, ప్రమాదకరమైనవారైతే, దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలో ఉండేవారని భావిస్తారు.

పురాణాల ప్రకారం, అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని. అలా విధించబడిన భస్మాసురుని కధ చాలా పేరుగాంచింది. భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు కారణంగా, మహాదేవుడు కరుణించి, ఒక వరం కోరుకొమ్మన్నాడు.

భస్మాసురుడు చాలా సంతోషించి, తాను ఎవరి తల మీద చేయి పెడితే వారు భస్మం అయిపోయేలా వరం కోరుకున్నాడు. శివుడు ఒప్పుకొని ఆ వరం ప్రసాదించాడు. అధిక సంతోషంతో, మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తనమీద పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, అతను తన చేతితో శివుని తలను తాకాలి అనుకున్నాడు. వెంటనే శివుడు కాలిపోయి, బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు. చివరికి, శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి, ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు.

శివుడి సమస్యను విని, మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణు మూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి, భస్మాసురుని ముందు కనిపిస్తాడు. మోహిని ఎంత అందంగా ఉంటుందంటే, భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడౌతాడు. భస్మాసురుడు, మోహినిని పెళ్ళిచేసుకోమని కోరతాడు. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం, నృత్యంలో తనకు సాటిగా ఉన్నవాళ్ళను పెళ్లిచేసుకుంటానని చెప్తుంది. భస్మాసురుడు అందుకు అంగీకరించి, నృత్యం ప్రారంభిస్తాడు.

భస్మాసురుడు, మోహిని అడుగులకు, అడుగులను కలిపాడు, నృత్యం చేసే సమయంలో, మోహిని తన చేయిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు, అతను తన చేయిని తన తలపై ఉంచాడు. వెంటనే అతను కాలి, బూడిదైపోయాడు, తన కోరుకున్న వరాన్ని ఈ విధంగా పొందాడు.కోరుకున్న వరం భస్మాసురుడు పొందాడు. అన్న నానుడి ఈ కధ ఆధారంగా పుట్టింది. తన పనులు తనకే ఎదురుతిరిగి, విధ్వంసకరంగా మరే లక్షణాన్ని ఇది సూచిస్తుంది.

 

Exit mobile version