మహిషాసురుని పుట్టుక వెనుక ఉన్న రహస్యం

ఆది పరాశక్తి దుర్గ అవతరమెత్తి మహిషాసురుని మట్టుపెట్టినందుకు ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటాము. కానీ త్రిమూర్తులకు ముచ్చెమటలు పట్టించిన మహిషాసురుడు ఎవరి పుత్రుడు అనేది చాలా మందికి తెలియదు. మహిషాసురుని జననం వెనుక గల వృతాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

mahishasuruduదానవ వంశానికి మూలపురుషుడైన దనువుకు ఇద్దరు కుమారులు… రంభుడు, కరంభుడు. పుట్టుకతో దానవులైనా.. వీరిద్దరు గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరికి సంతానం లేకపోవడంతో పుత్రుల కోసం తపస్సు చేయాలని సంకల్పించారు. చిన్నవాడైన కరంభుడు ఒక మడుగులో దిగి ఒంటి కాలిమీద తీవ్రతపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు.

mahishasuruduఅలా వారిరువురూ తీవ్రతపస్సు చేస్తుండగా భయభ్రాంతులకు గురైన ఇంద్రుడు ఎలాగైనా వారి తప్పస్సు భగ్నం చేయాలనుకుంటాడు. అనుకున్నదే తడవుగా మొసలి రూపం ధరించి, కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు. అది చుసిన రంభుడు తీవ్రవేదనకు గురయ్యాడు. అప్పుడే ఇంద్రుని చంపేయాలనుకుంటాడు. కానీ, తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కాకూడదనే ధర్మానికి కట్టుబడి.. శాంతిస్తాడు. కానీ తమ్ముడిని పోగొట్టుకున్న బాధలో తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన శిరస్సు ఖండించుకోబోతుండగా అంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై… ‘రంభాసురా… నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడా? ఈ ఆలోచన లేని ప్రయత్నం మానుకోమని చెబుతాడు.

mahishasuruduఅప్పుడు రంభుడు ఆవేదనతో దేవా! పోయిన నా తమ్ముడు తిరిగిరాడని నాకు తెలుసు. కానీ ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు. సంతానం కోసమేననే సత్యం తెలిసికూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముని చంపి మా దానవజాతికి తీరని మహాపరాథం చేసాడు. అందుకు ప్రతీకారంగా, సర్వప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకలలోకవందితుడు, త్రిలోకవిజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించమని కోరుకున్నాడు రంభాసురుడు.

mahishasuruduదానికి అగ్నిదేవుడు ‘రంభాసురా., నీ మనసు ఏ కామినిమీద కామవశీభూతమౌతుందో, ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు’ అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగివస్తూ మార్గమధ్యంలో యక్షవిహారభూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూసాడు. అక్కడ ఒక మహిషి(గేదె) కామార్తయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి, దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి, ఆ మహిషిని తన పాతాళనగరానికి పట్టమహిషిని చేసి, దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు.

mahishasuruduఅయితే ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఆ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగ్రుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్లముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూంటే, దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండుగర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహారభూమిని చేరి, అక్కడున్న యక్షులను శరణు కోరింది.

mahishasuruduయక్షులకు ఆ దున్నపోతుకు మధ్య జరిగిన భీకర యుద్ధంలో యక్షులు చివరకు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు రాజమహిషాన్ని ఓదార్చి, రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి, నిప్పుపెట్టారు. తన ప్రాణనాథుని పార్థివదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతూంటే చూసి తట్టుకోలేక, ఆ రాజమహిషి పరుగుపరుగున వచ్చి, రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూండగా., ఆ చితిమంటలనుంచి ‘మహిషాసురుడు’ ఆవిర్భవించాడు. అతడే రంభాసురుని కుమారుడు. మహిష-రాక్షస సంగమ సంజాతుడు. ‘మహిషాసురుడు’ తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళరాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR