రాత్రికి రాత్రి దెయ్యాలు ఆలయాన్ని ఎందుకు నిర్మించాయో తెలుసా ?

0
2782

దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఆత్మలు, దెయ్యాలు య్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మనదేశంలోని కొన్ని దేవాలయాలు స్వయంగా దేవతలే నిర్మించారని మన పురాణాల్లో ఉంది. అలాగే దెయ్యాలు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక గుడి కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని బొమ్మవర అనే గ్రామంలో ఉంది. ఆ గుడి పేరు సుందరేశ్వరాలయం. అంటే శివుడి గుడి.

దెయ్యాలు కట్టిన గుడిఆ గుడిలో ఉంటే శివలింగం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ గుడికి సుందరేశ్వరాలయం అని పేరు. ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయని స్థల పురాణం చెబుతోంది. ఇంతకీ దెయ్యాలు ఆ గుడిని ఎలా కట్టాయి? ఎందుకు కట్టాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దెయ్యాలు కట్టిన గుడిబొమ్మవర గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు జనాలను భయపెట్టేవట. జనాలను ప్రశాంతంగా ఉండనివ్వకపోయేవట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాక. అదే ఊరికి చెందిన దెయ్యాల మాంత్రికుడుని ఆశ్రయించారట. ఆ మాంత్రికుడు దెయ్యాలను తరిమికొట్టడానికి మంత్ర విద్యలను నేర్చుకున్నాడట. ఆ విద్యలతో దెయ్యాలను తరిమికొట్టాలని చూసినా ఆయనకు కుదరలేదట.

దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకొని ఊరి ప్రజలందరి సహకారంతో గుడిని నిర్మించాడట ఆ మాంత్రికుడు. అయితే ఆ ఊళ్లో శివాలయం నిర్మించడంతో తట్టుకోని దెయ్యాలు ఆ గుడిని ఓ రాత్రి నాశనం చేసేశాయి. దీంతో కోపోద్రికుడైన మాంత్రికుడు మరిన్ని మంత్రవిద్యలు నేర్చుకొని ఆ దెయ్యాలను మంత్రశక్తితో తన వశం చేసుకున్నాడట. వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర బంధించాడట.

దెయ్యాలు కట్టిన గుడిదీంతో అవి బంధీ అయిపోయిన తమను విడిపించాలంటూ ఆ దెయ్యాలు ఆ మాంత్రికుడిని వేడుకున్నాయట. అప్పుడు పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి, ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ మాంత్రికుడు వాటికి చెప్పాడట. ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక రాత్రికి రాత్రే దెయ్యాలు ఆ గుడిని పునర్నిర్మించాయట. ఆ గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.

దెయ్యాలు కట్టిన గుడిఆ గుడి మీద అన్నీ దెయ్యం బొమ్మలే ఉంటాయట. అయితే గుడిని మళ్లీ నిర్మించిన ఆ దెయ్యాలు గుడిలో శివలింగాన్ని ప్రతిష్టించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. దీంతో అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా అలాగే ఉండేదట. తర్వాత 50 ఏళ్ల కిందట ఆ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఓ బావిని తవ్వుతంటే పెద్ద శివలింగం బయట పడిందట. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్టించారట.

అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. ఆ శివలింగం 8 అడుగుల ఎత్తు ఉందట. ఇక.. ఈ గుడిని దెయ్యాలు కట్టినప్పటికీ.. ఎలాగూ శివుడు భూతనాథుడు కాబట్టి.. ఆయనకు ఈ గుడిలో పూజలు చేస్తున్నారట అక్కడి స్థానికులు. ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రాంత వాసులకు అంతా మంచే జరిగిందట.