శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. వాటికి ఏ మాత్రం సమస్య వచ్చినా శరీరం గతి తప్పుతుంది. ఎందుకంటే.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి.
అలాంటి కిడ్నీలను అనారోగ్యానికి గురి కాకుండ చూసుకోవాలి. వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మనం తీసుకునే ఆహారం లో కొన్ని ఆహారాలు వాటికి హాని కలిగిస్తాయి మరియు వాటిని అధికంగా తింటే వాటి సాధారణ పనితీరును ప్రభావితం చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా…
-
మాంసం:
మాంసాన్ని జీర్ణం చేయడానికి, వ్యర్థ ఉత్పత్తుల తొలగింపు మూత్రపిండాలకు భారంగా మారుతుంది కాబట్టి ఎక్కువ మాంసం తినడం మూత్రపిండాల సమస్యలకు కారణం కావచ్చు. జంతు ప్రోటీన్లతో కూడిన ఆహారం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కూడా దారితీస్తుంది. మాంసం యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు సాధారణ కారణాలలో ఒకటి. దీనికి బదులుగా ఎక్కువ కూరగాయలు మరియు గింజలను తినవచ్చు.
2. అవకాడోస్:
అవోకాడోలు వివిధ పోషక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వాటిని ఎక్కువ తినడం మూత్రపిండాలకు ప్రమాదకరం కావచ్చు. ప్రత్యేకించి ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి ఉంటే ఇది మరింత ప్రమాదకరం. ఈ పండులో పొటాషియం చాలా ఎక్కువ. అది శరీరానికి అవసరం. కానీ రక్తంలో ఎక్కువ పొటాషియం కండరాల తిమ్మిరి, క్రమరహిత హృదయ స్పందన వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
3. ప్రతిదానికీ మందులొద్దు:
ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొంతమంది వైద్యులను సంప్రదించకుండా నాన్ ప్రిస్ర్కిప్షన్ మాత్రలను వాడుతుంటారు. ఒకటి, రెండు సందర్భాల్లో అయితే ఫర్వాలేదు కానీ… దీర్ఘకాలికంగా ఇలా చేస్తే మాత్రం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
4. అరటి పండ్లు:
మీకు మూత్రపిండాల సమస్యలు ఉన్నట్లైతే, ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషణ, సరైన ఆహారం అవసరం. కానీ ఆరోగ్యకరం కదా అని ఎక్కువ తీసుకోకుండా అరటి వంటి కొన్ని ఆహార పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయడం మంచిది. ఎందుకంటే వాటిలో చాలా ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలు సరిగా పనిచేయని వారికి హానికరం.
సరిగా చెప్పాలంటే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు, పొటాషియం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల సమస్య ఉన్నవారి శరీరం వ్యర్థాలను అధికంగా ఫిల్టర్ చేయలేకపోతుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
5. ఉప్పు:
ఆరోగ్యకరమైన ఆహారంలో రోజుకు గరిష్టంగా 2300 మి.గ్రా సోడియం ఉండాలి. అంటే ఒక టీస్పూన్ ఉప్పు. అంతకన్నా ఎక్కువ ఉప్పు తింటే, అధిక రక్తపోటుకు దారితీసే అవకాశం ఉంది.
మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహరంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించి బదులుగా మీ ఆహారాలకు సుగంధ ద్రవ్యాలు, మూలికలను జోడించవచ్చు. తయారుగా ఉన్న సూప్లు, స్టోర్ చేయబడిన పిజ్జా, సలాడ్ డ్రెస్సింగ్ వంటి ప్రాసెస్ చేయబడిన మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగాన్ని కూడా తగ్గించాలి. ఎందుకంటే అవి సాధారణంగా చాలా ఉప్పును కలిగి ఉంటాయి.