అనారోగ్యంగా ఉన్న వాళ్లయినా, ఆరోగ్యవంతులైన పండ్లు తింటే మంచిదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అందుకే చాలా మంది రైస్, చపాతీ, రోటీలు మానేసి పండ్లు తింటూ ఉంటారు. కొంత మంది ముఖ్యంగా ఉదయం పూట టిఫిన్ మానేసి మరీ పండ్లు అల్పాహారంగా తీసుకుంటారు. ఇలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఉదయం టిఫిన్ మానేసి పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఖాళీ కడుపుతో పండ్లు తినడం వలన కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అరటిపండు తింటే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.
ఇక సలాడ్ తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. ఉదయమే సిట్రిస్ ఉండే నారింజ, కివీ వంటి సిట్రల్ జాతి పండ్లను తీసుకోవద్దు. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినడం వలన గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తుంటాయి.
చపాతిలు, పూరిలు, జొన్న, రాగి లేదా సజ్జలతో చేసిన వాటిని తీసుకువడం మంచిది. ఇక ఉడికించిన ముక్కలు లాంటివి తీసుకున్నా మంచిది. పీచు పదార్దాలు ఉండే కూరలు తీసుకోండి. ఉదయం టిఫిన్ మాత్రం కచ్చితంగా తీసుకోండి.