పరమ శివుని పుత్రికలు వాళ్ల పుట్టుక వెనక గల రహస్యం

శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలో సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడ్డాడు.

పరమ శివుని పుత్రికలుకార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప.. ఈ ముగ్గురూ.. శివుడి కొడుకులని మనందరికి తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని..చాలా తక్కువ మందికి మాత్రమే.. తెలుసు. అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు?

పరమ శివుని పుత్రికలుశివుడి కొడుకులు పొందిన ప్రఖ్యాతి కూతుళ్లు ఎందుకు పొందలేదు శివుడి ముగ్గురు కూతుళ్లను, కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు. అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో.. శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు.

పరమ శివుని పుత్రికలు అసలు శివుడికి కూతుర్లు ఎప్పుడు పుట్టారు ? కొడుకులు ప్రఖ్యాతి చెందినంత కూతుర్లు ఎందుకు అంత ప్రఖ్యాతి చెందలేదో తెలుసుకుందాం. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.

అశోక సుందరి :

పరమ శివుని పుత్రికలుపార్వతి దేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం.. అశోక సుందరిని సృష్టించారు. పద్మ పురాణంలో.. అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తీగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా.. అశోక సుందరి ప్రస్తావన తెలుస్తుంది. ఈమెను పార్వతిదేవి సృష్టించింది. అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే.. అందమైన అని అర్థం. శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు.. భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని.. ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా.. జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో పూజిస్తారు.

జ్యోతి :

పరమ శివుని పుత్రికలుఈమె పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపు, శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి.. ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతిదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు. జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి.. జ్వాలాముఖిగా పూజిస్తారు.

మానస :

పరమ శివుని పుత్రికలుశివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల.. పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతి కూతురు కాదని చెబుతారు. వాసుకి సోదరి మానస అని.. బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే.. పాముల రాజు. తన తండ్రి, భర్త, పార్వతి దేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపంతో ఉంటుందని.. కథలు ఉన్నాయి. మానసను.. బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను.. ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే.. ఆ సమయంలో పాములు ఉత్సహంగా ఉంటాయి. అలాగే.. ఈమెను పూజించడం వల్ల పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR