మన భారతదేశంలో ఎలాంటి టెక్నాలజీ అనేది లేని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించబడ్డ కొన్ని కొన్ని శివుని ఆలయాలు ఒక స్ట్రయిట్ లైన్ నిర్మించడం అనేది ఆశ్చర్యకర విషయం. అయితే ఎలియెన్స్ వీటిని నిర్మించి ఉండొచ్చు అనేది ఒక వాదన. మరి సరిగ్గా ఒకే స్ట్రయిట్ లైన్ లో నిర్మించబడిన ఆ పంచభూత ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఒకే లాంగిట్యూడ్ లో ఉన్న దేవాలయాల సంఖ్య మొత్తం ఎనిమిది. అందులో ఆరు సౌత్ ఇండియా లో ఉన్నాయి. అందులో కేదార్నాథ్ నుండి మొదలుపెడితే కాళేశ్వరం లోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తి ఆలయం, కాంచీపురంలో ఏకాంబేశ్వర ఆలయం, తిరువనై లోని జంబుకేశ్వర ఆలయం, తిరువణ్ణా మలై లోని అన్నామలై ఆలయం, చిదంబరంలో నటరాజస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాధ ఆలయం ఇవన్నీ కూడా ఒకే లాంగిట్యూడ్ లో నిర్మించబడ్డాయి.
పంచభూతాలు అంటే, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటినే పంచభూతాలు అంటారు. దక్షిణభారతదేశంలో పంచ భూతాలకు ఐదు దేవాలయాలను నిర్మించారు. ఇందులో నాలుగు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అవి కంచి లో పృథ్వి లింగం, చిదంబరం లోని ఆకాశ లింగం, అరుణాచలం లోని అగ్ని, జంబుకేశ్వరంలో నీరు, శ్రీకాళహస్తిలో వాయువు. అయితే ఈ ఐదు ఆలయాలు కూడా యోగిక్ శాస్రం ఆధారంగా నిర్మించబడ్డాయని పురాణాలూ చెబుతున్నాయి.
మన ఇండియా మ్యాప్ లో ఈ ఆలయాలు చూస్తే అన్ని కూడా ఒక స్ట్రయిట్ లైన్ లో కనిపిస్తాయి. అయితే ఈ ఆలయాలు అన్ని కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి పరికరాలు లేని కాలంలో నిర్మించబడ్డాయి. ఇందులో చిదంబరం ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు కానీ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మిచినట్లుగా పురాణాలూ చెబుతున్నాయి. అయితే దేవతలే వీటి నిర్మాణానికి కారణం అంటూ కొందరు చెబుతుంటే, ఎటువంటి పరికరాలు లేని ఆ కాలంలో ఎలియెన్స్ సహాయంతో ఈ ఆలయ నిర్మాణాలు జరిగి ఉంటాయని కొందరు అంటుంటారు.
ఇలా ఈ ఆలయాలు ఒకే స్ట్రయిట్ లైన్ లో ఎలా నిర్మించబడ్డాయి, వీటి నిర్మాణం వెనుక దేవతలు ఉన్నారా, అసలు టెక్నాలజీ లేని ఆ సమయంలో వీటి నిర్మాణానికి ఎలియెన్స్ సహాయం చేశాయా అనేది ఒక మిస్టరీనే