మట్టి తినడం, బలపాలు, చెక్ పీస్ లు తినడం చిన్న పిల్లల్లోని కాదు పెద్ద వాళ్ళలోనూ చూస్తుంటాం. కొంతమందికి రెగ్యులర్ గా చాక్ పీసెస్, బలపాలు తినాలనిపిస్తుంటుంది. దీనికి కారణం పీకా అనే ఓ సమస్య ఉన్నట్లు. దీనికి గనుక సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే భవిష్యత్లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి దారి తీయొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
1. దంతాలు పాడవ్వడం
2. జీర్ణ సమస్యలు
3. మలబద్ధకం
4. లెడ్ పాయిజనింగ్
5. కడుపులో నులిపురుగు పెరగడం
6. ఆకలి లేకపోడం
ఇలా మట్టి, శుద్ధ తినడాన్ని మృద్బక్షణ అని అంటారు. ఇది సాధారణంగా రక్త క్షీణత, అజీర్తి, నులి పాములు, ఏలిక పాములు చిన్నపిల్లల కడుపులో ఉన్నపుడు ఈ లక్షణం వస్తుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి సుద్ధ, మట్టి, నామసుద్ధ, బలపాలు తినాలనిపిస్తుంది. అది అంతటితో ఆగదు సరికదా.. ఇతర వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నిరోధించేందుకు మందులు వాడాలి. అవేంటో చూద్దాం.